PV Sindhu : చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌తో గ్రాండ్ కంబ్యాక్.!

PV Sindhu : గడిచిన రెండేళ్లుగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వరుస గాయాలు, ఆధునిక ఆటతీరులో వస్తున్న..

G Krishna
Published on: 19 July 2026 11:37 AM IST
pv-sindhu
X

pv-sindhu

PV Sindhu : గడిచిన రెండేళ్లుగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వరుస గాయాలు, ఆధునిక ఆటతీరులో వస్తున్న మార్పులు, 2024 నుండి ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడంతో.. రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన ఈ ఛాంపియన్ మళ్లీ పాత ఫామ్‌ను అందుకోగలదా లేదా అని చాలా మంది సందేహించారు. కానీ, ఆదివారం టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగిన ఫైనల్లో సింధు ఆ సందేహాలన్నింటికీ తన ఆటతోనే సమాధానం ఇచ్చింది.

తన పాత రోజులను గుర్తుకు తెచ్చేలా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన వ్యూహాలు, మానసిక దృఢత్వంతో ఆడిన 31 ఏళ్ల సింధు.. జపాన్ స్టార్ క్రీడాకారిణి అకానె యామగుచీని వరుస గేమ్స్ లో ఓడించి చరిత్ర సృష్టించింది. 21-17, 21-17 తేడాతో ఘన విజయం సాధించి, తన కెరీర్‌లో మొట్టమొదటి జపాన్ ఓపెన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర పుటల్లోకెక్కింది. అంతేకాకుండా, ఆమె కెరీర్‌లో ఇది మొదటి సూపర్ 750 (Super 750) టైటిల్ కావడం విశేషం.

యామగుచీపై సింధు పంజా.. తొలి గేమ్ లో హోరాహోరీ

తొలి గేమ్ లో సింధు తనదైన శైలిలో పవర్‌ఫుల్ స్మాష్‌లు, అద్భుతమైన క్రాస్-కోర్ట్ డ్రాప్స్‌తో యామగుచీని ముప్పుతిప్పలు పెట్టింది. మ్యాచ్ ప్రారంభం నుండి ఇద్దరి మధ్య పాయింట్ల కోసం హోరాహోరీ పోరు సాగింది. అయితే, కీలకమైన సమయంలో ఒత్తిడిని అధిగమించిన సింధు, వరుసగా పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను 21-17తో తన ఖాతాలో వేసుకుంది.

తగ్గని అగ్రెషన్.. తిరుగులేని డిఫెన్స్

మొదటి గేమ్ గెలిచిన జోష్‌లో సింధు రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడింది. సింధు అటాకింగ్‌కు హోమ్ ఫేవరెట్ యామగుచీ ఉక్కిరిబిక్కిరి అవుతూ వరుస తప్పులు చేసింది. దాడి చేయడమే కాకుండా, ఈ మ్యాచ్ లో సింధు డిఫెన్స్ కూడా అద్భుతంగా సాగింది. యామగుచీ నెట్ వద్ద వేసిన షాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. చివరి నిమిషంలో టోక్యో ప్రేక్షకుల మద్దతుతో యామగుచీ పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. సింధు ఏమాత్రం తడబడలేదు. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ నాటి క్లాసిక్ ఆటను ప్రదర్శిస్తూ రెండో గేమ్‌ను కూడా 21-17తో ముగించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

ఏడేళ్ల తర్వాత దక్కిన అతిపెద్ద టైటిల్

సింధు చివరిగా 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గెలిచింది. ఆ తర్వాత ఆమె సాధించిన అతిపెద్ద విజయం ఇదే. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత, సింధు కెరీర్‌లో మళ్లీ అంతటి భారీ టైటిల్‌ను అందుకోవడం ఇదే కావడం విశేషం. ప్రపంచ నంబర్ 3 క్రీడాకారిణిని ఆమె సొంత గడ్డపైనే ఓడించడం ద్వారా, బ్యాడ్మింటన్ ప్రపంచానికి తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశానని సింధు ఘనంగా చాటిచెప్పింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story