AFG vs IND: సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ.. వైభవ్ ఓపెనింగ్ జోడీపై కీలక అప్డేట్..?
AFG vs IND: వైభవ్ కోసం అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో ఓపెనింగ్ భాగస్వామి ఎవరనే చర్చ జరుగుతోంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు పోటీలో ఉన్నా, వైభవ్ జోడీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
AFG vs IND: సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ.. వైభవ్ ఓపెనింగ్ జోడీపై కీలక అప్డేట్..?
Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు భారత జట్టు ఓపెనింగ్ కాంబినేషన్పై చర్చ మొదలైంది. జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. జింబాబ్వే పర్యటనలో వైభవ్, అభిషేక్ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి రావడంతో కొత్త కాంబినేషన్ను పరిశీలించే అవకాశం ఉందని మాజీ భారత క్రికెటర్ దీప్ దాస్గుప్తా సూచించారు. ప్రపంచకప్ వంటి కీలక టోర్నీలకు ముందు వివిధ కాంబినేషన్లను పరీక్షించడం ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
వైభవ్తో సంజూ జోడీ..?
భారత జట్టు ఇటీవల ఓపెనింగ్ స్థానాల్లో పలు కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరోవైపు వైభవ్ సూర్యవంశీకి అభిషేక్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. దీంతో ఇప్పటివరకు కలిసి ఆడని సంజూ–వైభవ్ జోడీని కూడా పరీక్షించవచ్చని దాస్గుప్తా సూచించారు.
అభిషేక్ను తప్పించాలని తన సూచన కాదని దాస్గుప్తా స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లకు సరైన అవకాశాలు, మ్యాచ్ సమయం ఇచ్చి ఏ కాంబినేషన్ మెరుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్ సిరీస్ వివరాలు..
అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో అభిషేక్, వైభవ్, సంజూతో పాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు.




