Srikakulam: ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు ఇద్దరి అరెస్ట్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2.5 కేజీల గంజాయి స్వాధీనం. ఒడిశా నుండి తమిళనాడుకు తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు: సీఐ చిన్నమనాయుడు వెల్లడి.
Srikakulam: ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు ఇద్దరి అరెస్ట్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఒడిశా నుంచి తమిళనాడుకు ఇచ్చాపురం మీదుగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా వెల్లోడు గ్రామానికి చెందిన రాజశేఖర్తో పాటు ఓ మైనర్ బాలుడు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇచ్చాపురం పట్టణ పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వీరి కదలికలపై అనుమానం రావడంతో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో 2 కిలోల 500 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద ఉన్న ఒక సెల్ఫోన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇచ్చాపురం సీఐ చిన్నమనాయుడు తెలిపారు. మైనర్ బాలుడికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.




