Kanchili: అర్జునాపురంలో నరసింహ అవతారంలో గణనాథుడు: భక్తుల రద్దీ

Kanchili: కంచిలి మండలం అర్జునాపురంలో నరసింహ అవతారంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంఈఓలు హాజరై పూజలు చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 18 Sept 2026 9:51 PM IST
Kanchili
X

Kanchili: అర్జునాపురంలో నరసింహ అవతారంలో గణనాథుడు: భక్తుల రద్దీ

కంచిలి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కంచిలి మండలం అర్జునాపురం గ్రామంలో వినాయకుడిని భిన్నమైన ఆధ్యాత్మిక భావనతో నరసింహ అవతారంలో అలంకరించి ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నరసింహ స్వామి రూపాన్ని నేపథ్యంగా తీర్చిదిద్ది, మధ్యలో సుందరంగా అలంకరించిన గణనాథుడి ప్రతిమ భక్తి భావాన్ని మరింత పెంచుతోంది.

ఈ సందర్భంగా మండపాన్ని కంచిలి మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ) సప్పటి శివరామ్ ప్రసాద్, కుంబి చిట్టిబాబు, ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వినూత్న ఆలోచనతో నరసింహ అవతారాన్ని ప్రతిబింబించేలా మండపాన్ని రూపొందించడంపై వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET