Kaviti: కవిటిలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు.
Kaviti: కవిటిలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
కవిటి: కవిటి మండలం కవిటి గ్రామంలోని బెహరా వీధిలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను నగదును టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ బెందాళం రమేష్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏ మధుబాబు, కవిటి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు వజ్జ రంగారావు, బీ చక్రధర్ రావు, కమలహాసన్, బెహరా లక్ష్మణ్, బెహరా గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Next Story




