Pathapatnam: కక్ష సాధింపులకు చెక్ పెట్టి క్లీన్ చిట్ సాధించిన చంద్రబాబు!
Pathapatnam: సెప్టెంబర్ 9 రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు చంద్రబాబు అక్రమ అరెస్టుపై మండిపడ్డ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.
Pathapatnam: కక్ష సాధింపులకు చెక్ పెట్టి క్లీన్ చిట్ సాధించిన చంద్రబాబు!
Pathapatnam: సెప్టెంబర్ 9 రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజని, దేశ రాజకీయాల్లోనే అత్యంత దుర్దినమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడిన వివరాలు:
45 ఏళ్ల నిబద్ధత: నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా చంద్రబాబు నాయుడు నిబద్ధత, నిజాయితీలతో తెలుగు ప్రజలకు సేవలు అందించారు. "నిజం ఎప్పటికీ ఓడిపోదు నిజాయితీ ఎవరికీ తలవంచదు" అనే సూక్తి ఆయన రాజకీయ ప్రస్థానంతో మరోసారి నిరూపితమైంది.
కక్ష సాధింపు చర్యలు: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తున్నారనే కక్షతోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను అక్రమంగా అరెస్టు చేశారు.
53 రోజుల జైలు జీవితం: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతీ జరగకపోయినా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచి తీవ్రంగా వేధించారు.
ప్రపంచవ్యాప్త నిరసనలు: ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏకతాటిపైకి వచ్చి నాటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ పోరాటంతో తెలుగు సమాజం ప్రజాస్వామ్యానికి అండగా నిలిచింది.
న్యాయస్థానాల క్లీన్ చిట్: నాటి వైసీపీ ప్రభుత్వ వైఖరిని తిరస్కరించిన న్యాయస్థానాలు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేస్తూ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చాయి.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధియే లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




