Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు!

Srikakulam: ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. రాజాంలో ఇసుక లారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా రేగిడి మండలాల్లో అక్రమ తవ్వకాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 July 2026 11:04 AM IST
Srikakulam
X

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు!

శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇసుక లారీల అధిక రాకపోకలతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేకువజామున రాజాం పట్టణ ప్రధాన రహదారిపై ఓ ఇసుక లారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈ ఘటనతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

అక్రమ ఇసుక రవాణాపై అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

రేగిడి, సంతకవిటి మండలాల్లో నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story