Srikakulam: పెద్ద బొరిగివలసలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పెద్ద బొరిగివలసలో వినాయక ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ గణేష్ సూచించారు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 19 Sept 2026 7:27 AM IST
Srikakulam
X

Srikakulam: పెద్ద బొరిగివలసలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు!

Srikakulam: పెద్ద బొరిగివలస గ్రామంలో నర్సనపేట సీఐ ఎం. శ్రీనివాసరావు మరియు నర్సనపేట ఎస్‌ఐ బి. గణేష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. వినాయక ఉత్సవాలు మరియు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రజలకు సూచించారు.

సమీప భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అభయం కార్యక్రమం కోసం సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్య, ఉపాధి మరియు సమాజానికి ఉపయోగపడే సన్మార్గంలో ముందుకు సాగాలని అవగాహన కల్పించారు.

అనంతరం చిన్న బొరిగివలస గ్రామంలో వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించి, నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలకు నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు శాంతిభద్రతలకు సంబంధించిన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద బొరిగివలస మరియు గ్రామం పెద్దలు, యువత, ప్రజలు పాల్గొన్నారు. వినాయక ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA