Revanth Reddy: ఉద్యోగులకు కోటి.. సామాన్యులకు 5 లక్షలు.. బీమా రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు మరియు సామాన్య పౌరుల భద్రత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 23 March 2026 2:58 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: ఉద్యోగులకు కోటి.. సామాన్యులకు 5 లక్షలు.. బీమా రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు మరియు సామాన్య పౌరుల భద్రత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు భారీ బీమా ప్యాకేజీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఉద్యోగులకు 'కోటి' భరోసా..

ముఖ్యంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే విద్యుత్ శాఖ మరియు సింగరేణి ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సింగరేణి మరియు విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి ప్రమాద బీమాను అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉద్యోగుల్లో మనోదైర్యం నింపేందుకు అసెంబ్లీ వేదికగానే బాధితులకు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఇలాంటి భారీ బీమా సౌకర్యం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇందిరమ్మ జీవిత బీమా.. 1.15 కోట్ల మందికి లబ్ధి

సామాన్య పౌరుల కోసం 'ఇందిరమ్మ జీవిత బీమా' అనే నూతన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ధీమా కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1 కోటి 15 లక్షల మందికి ఈ ఇందిరమ్మ జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

ప్రతి పౌరుడికి ఆరోగ్య, జీవిత బీమా

ప్రభుత్వ యంత్రాంగం కోసం పనిచేసే ప్రతి ఉద్యోగికి, అలాగే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య మరియు జీవిత బీమా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ బీమా పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని, ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story