Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!
Parkal: పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు రూ. వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!
పరకాల: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:
🔹రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
🔹రూ. 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు
🔹రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం
🔹రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం
🔹రూ. 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం
🔹రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు
🔹రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు
🔹ఆత్మకూర్లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు శంకుస్థాపన
🔹రూ. 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన
🔹రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం
ప్రారంభోత్సవాల వివరాలు:
🔹పరకాలలో రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం.
🔹ఆత్మకూర్లో రూ. 1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం.
🔹పరకాలలో రూ. 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం.




