Revanth Reddy: మూసీ ప్రజలను నిరాశ్రయులను చేయం.. నాది గ్యారెంటీ!

Revanth Reddy: తెలంగాణ శాసన మండలి వేదికగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 23 March 2026 1:07 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: మూసీ ప్రజలను నిరాశ్రయులను చేయం.. నాది గ్యారెంటీ!

Revanth Reddy: తెలంగాణ శాసన మండలి వేదికగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ, ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదని, హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ అని ఆయన అభివర్ణించారు.

ప్రజలకు ప్రభుత్వం తరపున మాటిస్తున్నా..

మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారనే ప్రచారానికి సీఎం చెక్ పెట్టారు. ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి ఒక్కరికీ మెరుగైన వసతులతో కూడిన పునరావాసం కల్పిస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విపక్షాల ఉచ్చులో పడి ప్రాజెక్టును అడ్డుకోవద్దని, ప్రజలు అపోహలకు లోనుకావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

సలహాల కోసం కేబినెట్ సబ్ కమిటీ!

విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రాజెక్టుపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని వేస్తామన్నారు.

"మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వమే ప్రారంభించింది. మీరు వదిలేసిన పనిని మేము ముందుకు తీసుకెళ్తుంటే అభ్యంతరం ఎందుకు?" అని ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపాలని కాకుండా, ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని, నగరాన్ని మురికి నుంచి కాపాడే ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story