Gangadhara: మహిళా బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి.. బీజేపీ ఆందోళన

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 April 2026 1:39 PM IST
Gangadhara
X

Gangadhara: మహిళా బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి.. బీజేపీ ఆందోళన

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తా వద్ద పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, మహిళల హక్కులు మరియు సాధికారతకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం మహిళల అభివృద్ధి, సాధికారతపై నమ్మకద్రోహం చేసినట్లేనని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ కీలకమైన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం ద్వారా వారి మహిళా వ్యతిరేక వైఖరి బహిర్గతమైందని అన్నారు.

మహిళల సాధికారతకు ప్రధాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు అన్ని రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు కోల అశోక్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్, కిసాన్ మోర్చా నాయకులు సుద్దాల రవీందర్ రెడ్డి, పెంచాల రాములు, ఆకుల మనోహర్, మండల ఉపాధ్యక్షులు గంకిడి చంద్రారెడ్డి, బొమ్మకంటి రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు రేండ్ల శ్రీనివాస్,

తాళ్ల రాజశేఖర్, మండల నాయకులు గాలిపెల్లి శ్రీనివాస్, పృధ్విధర్ గౌడ్, జోగు అజయ్, హర్ష రాజు, వెంకట్ రెడ్డి, రావుల సత్యనారాయణ, సర్వ వినోద్, బత్తిని శ్రీధర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు దయ్యాల ప్రణయ్, వోడ్నాల రాజు, గరిగంటి సుమన్, తుమ్ కరుణాకర్, చిందం ఆంజనేయులు, బండ అనిల్, దుబ్బాసి బాలు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story