Karimnagar: గంగాధరలో జర్నలిస్టు మేడి ప్రసాద్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జర్నలిస్టు మేడి ప్రసాద్‌ను అభినందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 19 April 2026 9:07 AM IST
Karimnagar
X

Karimnagar: గంగాధరలో జర్నలిస్టు మేడి ప్రసాద్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలో శనివారం నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో మధుర నగర్‌కు చెందిన జర్నలిస్టు మేడి ప్రసాద్ ప్రత్యేక గుర్తింపు పొందారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వెంటనే స్పందిస్తూ, ప్రాణాపాయంలో ఉన్న బాధితులను సమయానికి ఆసుపత్రులకు తరలించడం, పోలీసులకు వెంటనే సమాచారం అందించడం, అవసరమైన సహాయ సహకారాలు అందించడం వంటి అనేక సామాజిక సేవల ద్వారా ఆయన ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

జర్నలిస్టుగా తన వృత్తి బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా, సామాజిక సేవకుడిగా కూడా మేడి ప్రసాద్ మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ఆలస్యం చేయకుండా స్పందించడం వల్ల పలువురి ప్రాణాలు కాపాడబడ్డాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గంగాధర మండలంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం మేడి ప్రసాద్ సేవలను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న మేడి ప్రసాద్‌ను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందిస్తూ ఆయన సేవా స్పూర్తిని కొనియాడుతున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story