Kishan Reddy: మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన 'చారిత్రక తప్పిదం'!

Kishan Reddy: మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Published on: 18 April 2026 5:21 PM IST
Kishan Reddy
X

Kishan Reddy: మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన 'చారిత్రక తప్పిదం'!

Kishan Reddy: మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకుందని, మహిళలకు తీరని అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై విపక్షాలను తీవ్రంగా నిలదీశారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల వాదనను కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. "దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ప్రధాని మోదీ ఒక శాస్త్రీయమైన ఫార్ములాను సిద్ధం చేశారు. కానీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుంది. ఇది మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లడమే" అని ఆయన మండిపడ్డారు.

వరుస ఎన్నికల ఓటములతో కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ మరియు ఆపరేషన్ సిందూర్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీని 'జాదుగర్' అంటూ కించపరచడం దేశ ప్రజలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా సాధికారతకు అడ్డుపడిన విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story