Kondagattu: భారీగా అంజన్న ఆదాయం.. పెరిగిన భక్తుల రద్దీ
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.
Kondagattu: భారీగా అంజన్న ఆదాయం.. పెరిగిన భక్తుల రద్దీ
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే హుండీ ఆదాయం మరోసారి గణనీయంగా నమోదైంది. ఆలయంలో 17 రోజుల పాటు సమకూరిన హుండీలను శుక్రవారం ప్రత్యేకంగా లెక్కించారు.
ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహణ అధికారి అంజనా రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొని హుండీలను పారదర్శకంగా లెక్కించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.75,02,126 నగదు ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈవో హరిహరనాథ్, స్థానాచార్యులు కపిందర్, ప్రధానార్చకులు రామకృష్ణ, పర్యవేక్షకులు సునీల్, ఏఎస్ఐ శ్రీనివాస్తో పాటు బ్యాంకు మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
Next Story




