KTR: దిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్.. మళ్లీ పట్టాలెక్కిస్తాం: ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ ధీమా!
KTR: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జెండా ఎగురవేశారు.
KTR: దిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్.. మళ్లీ పట్టాలెక్కిస్తాం: ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ ధీమా!
KTR: తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) ఆవిర్భావం జరిగి నేటికి 25 ఏళ్లు (రజతోత్సవ ఏడాది) పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గులాబీ జెండాను ఎగురవేసి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అడుగడుగునా పోరాటాలు చేస్తూ, దిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత బీఆర్ఎస్దేనని కొనియాడారు. "14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది" అని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పాలనల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు బీఆర్ఎస్ పునరంకితమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని మళ్లీ పట్టాలెక్కించి, ప్రజల పక్షాన పోరాటం చేయడం. కేసీఆర్ దార్శనికతతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.




