Bandi Bhagirath: బండి భగీరథ్‌కు ఊరట.. ఫోక్సో కేసులో బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

Bandi Bhagirath: ఫోక్సో (POCSO) కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 12:59 PM IST
Bandi Bhagirath
X

Bandi Bhagirath: బండి భగీరథ్‌కు ఊరట.. ఫోక్సో కేసులో బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత నెల రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయనకు మల్కాజ్‌గిరి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల నమోదైన ఒక వివాదాస్పద కేసులో బండి భగీరథ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన గత నెల రోజులుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్‌గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ బెయిల్ పిటిషన్‌పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న గౌరవ న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో, కాగితపు ప్రక్రియ ముగిసిన అనంతరం బండి భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story