Rajanna Sircilla: మిడ్ మానేరు నీటి మట్టం తగ్గుదల.. నిల్వలు పడిపోతున్నాయి

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లలో మిడ్ మానేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గుతోంది. ప్రస్తుతం 8.072 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది.

KALEEM, SIRICILLA
Published on: 21 April 2026 9:49 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల పరిస్థితి ప్రకారం రిజర్వాయర్ పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 307.58 మీటర్లుగా నమోదైంది.

మొత్తం 27.55 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయంలో ప్రస్తుతం 8.072 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో NIL‌గా నమోదు చేశారు. ఎస్సారెస్పీ, ఎస్‌వైపీ (జీపిహెచ్), మానేరు, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా వరద ప్రవాహం లేదు.

అవుట్‌ఫ్లో మాత్రం మొత్తం 435 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇందులో రైట్ స్లూయిస్ ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు, ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు ఎత్తలేదు. రైట్ స్లూయిస్ గేట్లలో నాలుగులో ఒక గేట్ మాత్రమే తెరిచి ఉంచి, గేట్ నంబర్ 3ను 0.4 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story