Tummala Nageswara Rao: పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా: తేమ పేరుతో కోతలు విధిస్తే అధికారులపై వేటు తప్పదు!

Tummala Nageswara Rao: పసుపు పండించే రైతాంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 31 March 2026 4:08 PM IST
Tummala Nageswara Rao
X

Tummala Nageswara Rao: పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా: తేమ పేరుతో కోతలు విధిస్తే అధికారులపై వేటు తప్పదు!

Tummala Nageswara Rao: పసుపు పండించే రైతాంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పసుపు కొనుగోళ్లలో అధికారుల తీరుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

తేమ పేరుతో ఇబ్బందులు వద్దు:

ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు క్వింటాళ్ల కొద్దీ భారీగా వస్తోంది. ఈ తరుణంలో తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి అధికారులను హెచ్చరించారు. తేమ ఉన్నప్పటికీ పసుపు పంటను ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతులను వేధింపులకు గురిచేసే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కరాఖండిగా చెప్పారు.

మౌలిక సదుపాయాల కల్పన:

పంటను రక్షించుకునేందుకు వీలుగా రైతులకు 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, పసుపు కొనుగోళ్లు నిరంతరాయంగా, వేగంగా సాగేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సకాలంలో చెల్లింపులు:

రైతులకు అందాల్సిన బకాయిలు మరియు చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని తుమ్మల పేర్కొన్నారు. నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకి సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిర్ణయంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story