Revanth Reddy: మొయినాబాద్ కేసుపై రేవంత్ రియాక్షన్.. ఆ విషయంలో మా ప్రమేయం లేదు..

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసు మరియు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 18 March 2026 2:59 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: మొయినాబాద్ కేసుపై రేవంత్ రియాక్షన్.. ఆ విషయంలో మా ప్రమేయం లేదు..

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసు మరియు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ఎవరికీ కొమ్ముకాయడం లేదని స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే బెయిల్:

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడంపై వస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిబంధనల ప్రకారమే వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు తప్ప, ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కోసం ఇప్పటికే సిట్ (SIT) ఏర్పాటు చేశాం" అని ఆయన వివరించారు.

ముందస్తు ఎన్నికలు లేవు:

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. తెలంగాణలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని, 2028లో ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాహుల్, ప్రియాంకలతో భేటీ:

అంతకుముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ముఖ్యమంత్రి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్ళిన రేవంత్ రెడ్డి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని వారికి పరిచయం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story