Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి 'సిట్'..
Moinabad Farmhouse Drug Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి 'సిట్'..
Moinabad Farmhouse Drug Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వేగంగా, లోతుగా దర్యాప్తు చేసేందుకు 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీపీ సుధీర్బాబు నేరుగా ఈ సిట్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
అసలేం జరిగింది?
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్హౌస్లో శనివారం రాత్రి మద్యం పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న 11 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులపై కాల్పులు.. ప్రధాన నిందితుడిగా రోహిత్ రెడ్డి
పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. అయితే, రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR)లో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై అభియోగాలు నమోదు కాగా, రోహిత్ రెడ్డిని **ప్రధాన నిందితుడు (A1)**గా చేర్చారు.
చంచల్గూడ జైలుకు నిందితులు
ఆదివారం రాత్రి పోలీసులు ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఉప్పర్పల్లి కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని భారీ భద్రత నడుమ చంచల్గూడ జైలుకు తరలించారు. మిగిలిన ఎనిమిది మంది నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. సిట్ ఏర్పాటుతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.




