POCSO Case: ములుగు జిల్లాలో సంచలన తీర్పు: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

POCSO Case: ములుగు జిల్లాలో నమోదైన ఓ పోక్సో కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ సంచలన తీర్పునిచ్చారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 10:55 AM IST
POCSO Case
X

POCSO Case: ములుగు జిల్లాలో సంచలన తీర్పు: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

POCSO Case: కన్నెబోయిన సమ్మయ్య అనే నిందితుడిపై ఇటివల నమోదైన పోక్సో కేసులో ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ సంచాలన తీర్పును ఇచ్చింది. నిందితుడుకి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించిందని SP సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. అలాగే బాధితురాలికి వెంటనే 10 లక్షల నష్టపరిహారం అందించాలని వెల్లడించారు.

అదే విధంగా నిందితుడుకి శిక్ష పడే విధంగా కృషిచేసిన, పోలీస్ అధికారులను, కోర్టు అధికారులను, అభినందించారు. మైనర్ పిల్లలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడానికి ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని SP సుధీర్ రాంనాథ్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story