CP Sajjanar: గణేశ్ మండపాలు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలి
Hyderabad: హైదరాబాద్లో గణేశ్ మండపాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
CP Sajjanar: గణేశ్ మండపాలు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలి
CP Sajjanar: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసే ప్రతి గణేశ్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగానే policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్లో తమ మండప వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
మండపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా అందిస్తే.. ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు కల్పించడానికి వీలవుతుందని తెలిపారు. అలాగే వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసు యంత్రాంగానికి మరింత సులువవుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
Next Story




