Nizamabad: మచర్లలో విషాదం మహిళ అనుమానాస్పద మృతి.. హత్యేనా?
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం మచర్ల గ్రామంలో దేవన్న (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Nizamabad: మచర్లలో విషాదం మహిళ అనుమానాస్పద మృతి.. హత్యేనా?
ఆర్మూర్: ఆలూర్ మండలం మచర్ల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుంకరి జయపాల భార్య దేవన్న (53) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, మహిళ మృతి అనుమానాస్పదంగా ఉన్నందున కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
Next Story




