Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన.. కేబినెట్ మార్పులపై అధిష్టానంతో చర్చ!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంతో పాటు ఏఐసీసీ అత్యవసర భేటీలో ఆయన పాల్గొంటారు.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన.. కేబినెట్ మార్పులపై అధిష్టానంతో చర్చ!
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు హస్తినలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అదే విధంగా ఏఐసీసీ సమావేశంలోనూ పాల్గొంటారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం నేతలతో చర్చించనున్నారు. కేబినెట్ లో మార్పులు చేర్పులపై అధిష్టానంతో మాట్లాడే ఛాన్స్ ఉంది. అదే విధంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్టంలో పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నారు.
Next Story




