Tomorrow Colleges Close: తెలంగాణలో రేపు కాలేజీలు బంద్.. కారణం ఇదే

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై నిరసనగా రేపు తెలంగాణలో డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలు మూసివేయనున్నారు.

Ramya Vegirouthu
Published on: 28 April 2026 8:43 PM IST
Telangana Colleges Closed Tomorrow Over Fee Issues
X

Telangana Colleges Closed Tomorrow Over Fee Issues

తెలంగాణలో విద్యార్థులకు కీలక అలర్ట్‌ జారీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఏప్రిల్‌ 29) డిగ్రీతో పాటు వృత్తి విద్యా కళాశాలలు మూసివేయనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిల సమస్యపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తోంది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది.

ఇప్పటికే ఏప్రిల్‌ 27న కలెక్టర్ల ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో “ఫీజు పోరుబాట” కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు మూసివేతకు పిలుపునిచ్చాయి.

విద్యార్థి సంఘాల ప్రకారం, సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపటి మూసివేత ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలపై పడే అవకాశం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story