Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఊరట

Telangana High Court: 2011 మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఈ తీర్పుతో పెద్ద ఉపశమనం లభించింది.

Arun Chilukuri
Published on: 24 April 2026 5:52 PM IST
Telangana High Court
X

Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఊరట

Telangana High Court: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అత్యంత కీలకమైన 'మిలియన్ మార్చ్' ఉదంతంపై నమోదైన కేసుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, మరియు హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి వారిపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం కొట్టివేసింది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 మార్చి 10న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 'మిలియన్ మార్చ్' నిర్వహించారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో అప్పటి పోలీసులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆనాడు జరిగిన ఘటనలతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చారని న్యాయస్థానానికి వివరించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, వారిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాదాపు 15 ఏళ్ల నాటి కేసుల నుంచి విముక్తి లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story