Telangana: పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఇన్కమ్ ఆధారంగా గ్రేడింగ్, ప్రమోషన్లు..
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వాటి వార్షిక ఆదాయం ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.
Telangana: పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఇన్కమ్ ఆధారంగా గ్రేడింగ్, ప్రమోషన్లు..
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే వార్షిక ఆదాయం ఆధారంగా వాటిని 4 గ్రేడ్లుగా విభజించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.
ఆదాయం ఆధారంగా పంచాయతీల గ్రేడింగ్ ఇలా:
పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనల ప్రకారం ఆదాయం ఆధారంగా పంచాయతీలను ఈ విధంగా వర్గీకరించనున్నారు:
గ్రేడ్-1: వార్షిక ఆదాయం రూ. 19 లక్షల కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-1గా గుర్తిస్తారు. ఈ కేటగిరీలో మొత్తం 945 పోస్టులను కేటాయించారు.
గ్రేడ్-2: వార్షిక ఆదాయం రూ. 13 లక్షల నుండి రూ. 19 లక్షల మధ్య ఉన్న వాటిని గ్రేడ్-2లోకి చేరుస్తారు. దీని కింద 1,258 పోస్టులు కేటాయించడం జరిగింది.
గ్రేడ్-3: రూ. 7 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్-3 హోదా ఇస్తారు. ఇక్కడ 3,769 పోస్టులు కేటాయించారు.
గ్రేడ్-4: వార్షిక ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-4గా పరిగణిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ విభాగంలోనే 6,788 పోస్టులను కేటాయించారు.
కార్యదర్శులకు ప్రమోషన్లు:
ప్రస్తుతం ఈ 4 గ్రేడ్ల విధానం ప్రతిపాదనల దశలో ఉంది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం గనక అధికారికంగా ఆమోదిస్తే, ఆయా గ్రేడ్లకు అనుగుణంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు త్వరలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.




