Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్!
Heatwave Alert: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్లో గరిష్టంగా 45.1 డిగ్రీలు నమోదు కాగా, రాబోయే రెండు రోజుల్లో 47 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్!
Heatwave Alert: తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఈ వేసవిలోనే అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3°C ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఐఎండీ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు 47°C వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలోనూ ఎండలు ముదురుతున్నాయి. ఆదివారం అంబర్పేట, యూసుఫ్గూడలో 42°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, అయితే కొన్నిచోట్ల స్థానిక పరిస్థితుల వల్ల సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.




