గుడిమల్లం పరశురామేశ్వర స్వామి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని చారిత్రాత్మక శ్రీ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం సందర్శించారు.
రేణిగుంట (తిరుపతి): తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని చారిత్రాత్మక శ్రీ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆలయ విశిష్టత,చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు.
Next Story




