Sullurupeta: దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత రెడ్డి

Sullurupeta: వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబానికి కాకాని పూజిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శ.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 May 2026 6:28 PM IST
Sullurupeta
X

Sullurupeta: దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత రెడ్డి

సూళ్ళూరుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, దివంగత దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత రెడ్డి పరామర్శించారు. మునిశేఖర్ రెడ్డి అకాల మరణం చెందడం పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి కాకాని పూజిత రెడ్డి.. మునిశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి, అక్కడ ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కాకాని పూజిత రెడ్డి, ఈ కష్టసమయంలో పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల వ్యాప్తికి ఆయన అహర్నిశలు శ్రమించారని, పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు.

నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీని ముందుండి నడిపించిన ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు మునిశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొని ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story