Renigunta: రేణిగుంటలో బైకుల ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Renigunta: రేణిగుంటలో బైకుల ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు
రేణిగుంట: రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
రెండు మోటార్సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




