Tirupati: పల్లా శ్రీనివాస్ యాదవ్ను కలిసిన సత్యవేడు టీడీపీ నేతలు
Tirupati: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో కేవీబీ పురం మండల నేతలు ఆయన్ని ఘనంగా సత్కరించారు.
Tirupati: పల్లా శ్రీనివాస్ యాదవ్ను కలిసిన సత్యవేడు టీడీపీ నేతలు
తిరుపతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కె. వి బి పురం మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు జన్మదిన సందర్బంగా శ్రీవారి దర్శన నిమ్మితం తిరుపతికి రావడంతో కె.వి.బి పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ గారి నేతృత్వంలో మండల నాయకులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రసాదలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మునస్వామి యాదవ్ గారితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు తిమ్మసముద్రం సర్పంచ్ దొరబాబు నాయుడు గారు, ఓల్లూరు సర్పంచ్ సురేష్ చౌదరి గారు, పాలెకర్ సంఘ కన్వినర్ వెంకటకృష్ణయ్య గారు, తెలుగు యువత అధ్యక్షులు వాసు నాయుడు గారు, ముకుంద రావు గారు తదితరులు పాల్గొన్నారు.




