Tiruchanur: దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు!
Tiruchanur: తిరుచానూరు పరిధిలోని దామినేడులో 150 మందికి ర్యాపిడ్ డ్రగ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు కౌన్సెలింగ్.
Tiruchanur: దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు!
తిరుచానూరు: తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ బి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, ఎస్సైలు సుధాకర్, సిద్ధారెడ్డి మరియు సిబ్బంది కలిసి ఆదివారం దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి ర్యాపిడ్ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.
డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




