Tirupati: ఏపీలో రెండేళ్ల కూటమి పాలన.. దామినేడులో విజయ సంకల్ప సభ
Tirupati: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Tirupati: ఏపీలో రెండేళ్ల కూటమి పాలన.. దామినేడులో విజయ సంకల్ప సభ
Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఉదయం 10.00 గంటలకు తిరుపతి సమీపంలోని దామినేడు నందు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీనియర్ టిడిపి నాయకులు వాడపల్లి జయచంద్ర నాయుడు పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్, ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలోను, రాష్ట్ర అభివృద్ధిలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తూ, రెండేండ్లు ప్రజారంజకమైన పాలన పూర్తయిన సందర్భంగా దామనేడులో "ఎన్డీయే కూటమి సంక్షేమ" భారీ బహిరంగ సభకు వేలాది సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని సీనియర్ టిడిపినేత మాజీ అధ్యక్షులు. తొటంబేడు వయసాయమార్కట్ కమిటీ వాడపల్లి జయచంద్రనాయుడు తెలిపారు.




