Big Debate: అమిత్ షా లేఖ రాశారు.. కానీ సభకు ఎందుకు రాలేదు?: AICC నేత అంబటి రామకృష్ణ
Big Debate: పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై AICC నేత అంబటి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు.
Big Debate: అమిత్ షా లేఖ రాశారు.. కానీ సభకు ఎందుకు రాలేదు?: AICC నేత అంబటి రామకృష్ణ
Big Debate: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, నీట్ అక్రమాలపై సమాధానం చెప్పలేకనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారని ఏఐసీసీ (AICC) నాయకుడు అంబటి రామకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సభ సజావుగా సాగితేనే తాము వచ్చి మాట్లాడతామంటూ హోం మంత్రి అమిత్ షా స్పీకర్కు లేఖ రాయడం సభాధ్యక్షుడి స్థానాన్ని అవమానించడమేనని రామకృష్ణ విమర్శించారు. సభను నిర్వహించే సత్తా స్పీకర్కు లేదని హోం మంత్రే స్వయంగా చెప్పినట్లు ఈ లేఖ ఉందన్నారు. సభ జరుగుతున్న సమయంలో పార్లమెంట్ చాంబర్లో ఉండి కూడా హోం మంత్రి, ప్రధాని లోక్సభలోకి రాకపోవడం స్వతంత్ర భారత చరిత్రలోనే మునుపెన్నడూ లేదని ధ్వజమెత్తారు.




