News Analysis: బియ్యం కేంద్రానివి.. పబ్లిసిటీ రేవంత్‌దా?: కాంగ్రెస్‌పై బీజేపీ నేత లక్ష్మీనారాయణ ఫైర్!

News Analysis: ఉచిత రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 11:25 AM IST
News Analysis
X

News Analysis: బియ్యం కేంద్రానివి.. పబ్లిసిటీ రేవంత్‌దా?: కాంగ్రెస్‌పై బీజేపీ నేత లక్ష్మీనారాయణ ఫైర్!

News Analysis: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉచిత రేషన్ బియ్యం మొదలుకొని బీసీ సంక్షేమం వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బూటకమని ఆయన ధ్వజమెత్తారు.

పేదలకు రేషన్ కార్డు ద్వారా అందించే 5 కిలోల బియ్యం (సన్న బియ్యమైనా, దొడ్డు బియ్యమైనా) కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తోందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి తమ ఫోటోలు, ముఖచిత్రాలు వేసుకుని ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వడ్డీ లేని రుణాల విషయంలో కూడా కేంద్రం అందించే సబ్సిడీలను మరుగున పరిచి రాష్ట్ర ప్రభుత్వం బిల్డప్ ఇస్తోందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story