Big Debate: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు మా పార్టీ ప్రధాన విధానం: UCCపై బీజేపీ స్పష్టం
Big Debate: దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలనేదే తమ విధానమని బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి స్పష్టం చేశారు.
Big Debate: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుపై జరుగుతున్న చర్చలో బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి స్పష్టమైన వైఖరిని వినిపించారు. జనసంఘ్ ఆవిర్భావం నుంచి కూడా దేశంలో అందరికీ ఒకే పౌర చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) ఉండాలనేది తమ పార్టీ ప్రధాన విధానమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు (ఆర్టికల్ 44) కూడా భవిష్యత్తులో UCCని అమలు చేసే దిశగా ప్రయత్నించాలని స్పష్టంగా చెబుతున్నాయని గుర్తుచేశారు.
UCC అంటే ఎవరి మత విశ్వాసాలలోనో, పూజా విధానాలలోనో జోక్యం చేసుకోవడం కాదని తేల్చిచెప్పారు. కేవలం వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, దత్తత వంటి విషయాలలో మాత్రం అన్ని మతాల ప్రజలకు ఒకే చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
లా కమిషన్ చేసిన వ్యాఖ్యల కంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలే ముఖ్యమని, దేశంలో అందరికీ సమానమైన చట్టాలు ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లో లివింగ్ రిషెన్షిప్లను రిజిస్ట్రేషన్ చేయాలని పెట్టడం వెనుక ఉద్దేశం.. సహజీవనం ద్వారా పుట్టి అనాధలవుతున్న పిల్లలకు చట్టపరమైన హక్కులు కల్పించడమేనని వివరించారు.




