Jordar Varthalu: ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు.. ప్రారం‎భోత్సవాలకు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి

Jordar Varthalu
x

Jordar Varthalu: ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు.. ప్రారం‎భోత్సవాలకు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Jordar Varthalu: అదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విశేషాలు! బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధికి 225 కోట్లు.

Jordar Varthalu: మన అదిలాబాద్ జిల్లాకు ఇగ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అదిలాబాద్ గడ్డపై అడుగుపెట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా, వరాల జల్లు కురిపించిండు. బాసర అమ్మవారి సాక్షిగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రేవంతన్న మాటిచ్చిండు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ 225 కోట్ల రూపాయలు కేటాయించింది కదా.. ఇగ ఆ పనులకు సీఎం రేవంత్ రెడ్డి సార్ భూమి పూజ చేసిండు. అంతకంటే ముందు తన మనవడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు చెల్లించుకున్నాడు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధిలో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని వేదిక మీదనే నిర్ణయం తీసుకున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories