News Analysis: తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: కాంగ్రెస్ నేత లింగం యాదవ్

News Analysis: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, లండన్ పర్యటన అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ నేత లింగం యాదవ్ సంచలన వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 24 Aug 2026 11:20 AM IST
News Analysis
X

News Analysis: తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: కాంగ్రెస్ నేత లింగం యాదవ్

News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ మరియు అమెరికా (US) పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. hmtv డిబేట్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగం యాదవ్ మాట్లాడగా, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని ధ్వజమెత్తారు.

'తెలంగాణ రైజింగ్' పేరుతో ఐవీ లీగ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు మరియు కార్పొరేట్ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైందని పేర్కొన్నారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా అడ్డుకుందోని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story