News Analysis: విద్యార్థులకు న్యాయం జరిగేవరకు 'బరాబర్ కొట్లాడుతాం'!

News Analysis: నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మరియు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌పై హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో మండిపడ్డ కాంగ్రెస్ నేత లింగం యాదవ్.

Arun Chilukuri
Published on: 23 July 2026 1:10 PM IST
News Analysis
X

News Analysis: విద్యార్థులకు న్యాయం జరిగేవరకు 'బరాబర్ కొట్లాడుతాం'!

News Analysis: దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలపై 'హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) న్యూస్ అనాలిసిస్' వేదికగా వేడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ లింగం యాదవ్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

డిబేట్‌లో కాంగ్రెస్ నేత లింగం యాదవ్ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్ల కాలంలో దేశంలో దాదాపు 150 కంటే ఎక్కువ సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపానని చెప్పుకునే ప్రధాని మోదీకి దేశంలో అన్యాయానికి గురవుతున్న సొంత దేశ విద్యార్థుల వేదన వినపడటం లేదా అని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story