News Analysis: కల్వకుంట్ల కమిటీకి ఈటల వకాలత్ పుచ్చుకుంటున్నారు: కాంగ్రెస్ ఫైర్!

News Analysis: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణ తేజ (సాయి తేజ) కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 13 July 2026 11:25 AM IST
News Analysis
X

News Analysis: కల్వకుంట్ల కమిటీకి ఈటల వకాలత్ పుచ్చుకుంటున్నారు: కాంగ్రెస్ ఫైర్!

News Analysis: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ మరియు కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభంపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. భద్రతా కారణాలను పక్కనబెట్టి, కేవలం రాజకీయ మైలేజ్ కోసమే బీఆర్ఎస్, బీజేపీలు రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ తేజ మండిపడ్డారు. హెచ్‌ఎంటీవీ న్యూస్ అనాలసిస్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను వివరించారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఒకే తాటిపైకి వచ్చి మాట్లాడుతున్నారని కృష్ణ తేజ విమర్శించారు. "గత ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చేలా, కల్వకుంట్ల కమిటీకి ఈటల రాజేందర్ వకాలత్ పుచ్చుకుంటున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story