News Analysis: పార్లమెంట్ సెషన్స్: కేంద్రంపై కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్!

News Analysis: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో హచ్‌ఎంటీవీ (hmtv) డిబేట్‌లో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 20 July 2026 11:22 AM IST
News Analysis
X

News Analysis: పార్లమెంట్ సెషన్స్: కేంద్రంపై కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్! 

News Analysis: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ.. దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, ప్రతిపక్షాలు సైతం ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జరిగిన hmtv డిబేట్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ లైవ్‌స్టాక్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా దేశ ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ కేటాయింపులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని చరణ్ కౌశిక్ యాదవ్ పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో మహిళా బిల్లు, జమిలి ఎన్నికలు (One Nation One Election), డీలిమిటేషన్ వంటి అంశాలను తెరపైకి తెచ్చి అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు లీకులు ఇస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ దానికి ఇతర వివాదాస్పద బిల్లులను ముడిపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story