BIG Debate: రూ. 22 వేల కోట్ల బకాయిలు.. కేవలం రూ. 6.5 కోట్లకే సెటిల్మెంట్: సుభాష్ చంద్ర ఎన్సీఎల్టీ కేసుపై తీవ్ర చర్చ
BIG Debate: జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రూ.22 వేల కోట్ల రుణ బకాయిల కేసులో ఎన్సీఎల్టీ సంచలన తీర్పు వెలువరించింది.
BIG Debate: రూ. 22 వేల కోట్ల బకాయిలు.. కేవలం రూ. 6.5 కోట్లకే సెటిల్మెంట్: సుభాష్ చంద్ర ఎన్సీఎల్టీ కేసుపై తీవ్ర చర్చ
BIG Debate: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కార్పొరేట్ రుణాల వసూలు వ్యవహారంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వెలువరించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది. సుమారు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్న రుణ బకాయిలకు గాను, కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించేలా ట్రిబ్యునల్ ఆమోదం తెలపడంపై ఆర్థిక వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుభాష్ చంద్ర వ్యక్తిగత పూచీకత్త కింద ఉన్న మొత్తం రూ. 22,006 కోట్ల దావాకు బదులుగా, ఆయన వ్యక్తిగత ఎస్టేట్ నుంచి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించేలా NCLT బెంచ్ ఆమోదం తెలిపింది. దీనివల్ల బ్యాంకులు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది.




