News Analysis: వందేమాతరంపై వివాదం: కాంగ్రెస్పై బిఆర్ఎస్ నేత దత్తాత్రేయ విమర్శలు
News Analysis: వందేమాతరం గీతంలో కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బిఆర్ఎస్ నేత దత్తాత్రేయ తీవ్రంగా తప్పుపట్టారు.
News Analysis: వందేమాతరంపై వివాదం: కాంగ్రెస్పై బిఆర్ఎస్ నేత దత్తాత్రేయ విమర్శలు
News Analysis: జాతీయ గేయం ‘వందేమాతరం’ను కాంగ్రెస్ పార్టీ తన సొంత కార్యక్రమాల్లో కేవలం మొదటి రెండు చరణాలకు మాత్రమే పరిమితం చేయాలని వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తీర్మానించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై హెచ్ఎమ్టీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక విశ్లేషణలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) నేత దత్తాత్రేయ, కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా నిరసించారు.
దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం ఒక ఉత్తేజకరమైన ఉద్యమ గీతంగా నిలిచిందని, బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ ఆణిముత్యాన్ని దేశంలోని ప్రతి పాఠశాలలోనూ తరతరాలుగా పాడుకుంటూ వస్తున్నామని దత్తాత్రేయ గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పి.వి. నరసింహారావు గారి నాయకత్వంలో తెలంగాణ నేలపై వందేమాతర ఉద్యమం ఎంత గొప్పగా సాగిందో ఆయన వివరించారు.




