News Analysis: కొత్త టెక్నాలజీలు వస్తున్నా.. ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎందుకు మౌనం? బీజేపీ అంజనేయులు నిలదీత!

News Analysis: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Arun Chilukuri
Published on: 9 July 2026 11:36 AM IST
News Analysis
X

News Analysis: కొత్త టెక్నాలజీలు వస్తున్నా.. ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎందుకు మౌనం? బీజేపీ అంజనేయులు నిలదీత!

News Analysis: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని బీజేపీ నాయకుడు అంజనేయులు ప్రశ్నించారు. ప్రాజెక్టుల లోపాలను సరిదిద్దేందుకు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వాడుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

hmtv న్యూస్ అనాలిసిస్ లో బీజేపీ నాయకుడు అంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయని, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ లేదా లోపాల సవరణకు వీటిని సులభంగా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story