Vijayawada: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రాఖీ కట్టిన మహిళలు!
Vijayawada: విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు మహిళా సోదరీమణులు ఆప్యాయంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రాఖీ కట్టిన మహిళలు!
Vijayawada: విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళా సోదరమణిలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు నుదుటన తిలకం దిద్ది, మిఠాయిలు తినిపించారు.
అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదర–సోదరీమణుల ఆప్యాయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




