Bhogapuram Airport: 13,750 మందితో థింసా నృత్యం.. మోదీకి అపూర్వ స్వాగతం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి ఉట్టిపడింది. 13,750 మంది కళాకారుల థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.

Arun Chilukuri
Published on: 1 Aug 2026 11:45 AM IST
Bhogapuram Airport
X

Bhogapuram Airport: 13,750 మందితో థింసా నృత్యం.. మోదీకి అపూర్వ స్వాగతం!

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన థింసా నృత్య ప్రదర్శన అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏకంగా 13,750 మంది గిరిజన కళాకారులు ఒకేసారి థింసా నృత్యం చేస్తూ ప్రధానికి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.

గిరిజన సంస్కృతి ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ ప్రదర్శన కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు థింసా నృత్యంలో పాల్గొన్నారు. వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో ఏకకాలంలో అడుగులు వేస్తూ సభా ప్రాంగణాన్ని కంటికి రెప్పలా అలరించారు.

ఈ అద్భుత ప్రదర్శన కోసం విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనం నుంచి బహిరంగ సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా భారీ వేదికను నిర్మించారు. టెర్మినల్ పరిశీలన ముగించుకుని, సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ థింసా నృత్యాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ, కళాకారులకు అభివాదం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story