Vizag: అరిలోవలో 3.7 కేజీల గంజాయి స్వాధీనం - ముగ్గురి అరెస్ట్!
Vizag: అరిలోవలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3.7 కిలోల గంజాయి కారు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
Vizag: అరిలోవలో 3.7 కేజీల గంజాయి స్వాధీనం - ముగ్గురి అరెస్ట్!
Vizag: ఆరిలోవ బిఆర్టిఎస్ రోడ్డులోని డెంపింగ్ యార్డ్ సమీపంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరిలోవ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.70 కేజీల గంజాయి,మహీంద్రాTUV 300కారు మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరిలోవ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 248/2026 (NDPS యాక్ట్).అరెస్ట్ అయినవారు.. పిన్నింటి శ్యామ్ చరణ్ (21, సీతమ్మధార),కేలవలస హేమంత్ కుమార్ (22, అక్కయ్యపాలెం),బోనుల ప్రవీణ్ తేజ (19,జగదాంబ సెంటర్). నిందితుల్లో మరొకరు అబ్స్క్యాండింగ్ ప్రధాన నిందితుడు అమీర్ పోలీసులను చూసి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.
విశ్వసనీయ సమాచారంతో అరిలోవ ఎస్ఐ హెచ్. వరహాల నాయుడు నేతృత్వంలో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.పరారీలో ఉన్న అమీర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.




