Koyyuru: కాకరపాడు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఇక ఏఐ నైపుణ్య శిక్షణ కేంద్రం!

Koyyuru: అల్లూరి జిల్లా కాకరపాడులో నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న హాస్టల్ రూ.15 లక్షలతో ఆధునీకరణ. గిరిజన యువతకు AI శిక్షణ ప్రారంభించిన ఐటీడీఏ పీవో.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 26 Aug 2026 10:33 AM IST
Koyyuru
X

Koyyuru: కాకరపాడు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఇక ఏఐ నైపుణ్య శిక్షణ కేంద్రం!

Koyyuru: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు లో గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కాకరపాడు పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ చొరవతో ఈ భవనాన్ని రూ.15 లక్షలతో ఆధునికీకరించి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చి గిరిజన నిరుద్యోగ యువతకు సోమవారం నుంచి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లో శిక్షణ ఇస్తున్నారు.

కాకరపాడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినుల కోసం రూ.2 కోట్లతో నిర్మించిన పోస్టుమెట్రిక్ వసతి గృహం నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనిపై దృష్టి సారించిన ఐటీడీఏ పీవో పర్యటనలో భాగంగా ఈ భవనాన్ని పరిశీలించి వృత్తి నైపుణ్య శిక్షణకు అన్ని విధాల అనుకూలమని భావించారు.

దీని ఆధునికీకరణకు రూ.15 లక్షలు మంజూరు చేసి వేగంగా పనులు పూర్తి చేయించారు. ఇందులో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ భవనం వినియోగంలోకి రావడంతో పాటు గిరిజన యువతకు ఏఐపై శిక్షణ ఇస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story